Tabs



Oct 14, 2014

హుద్ హుద్: కొంచెం సమ్యమనం పాటించండి.


ఒక బస్తీకి 5 పెద్దలారీల నిత్యావసరాలు వరదబాధితుల సహయార్థం వస్తే జనాలు ఎప్పటిలాగే ఎగబడి తీసుకుంటున్నారు..ఎవరికి ఎన్ని వెల్తున్నాయి, ఒకరే 2/3 తీసుకున్నా తెలియని పరిస్థితి.పోలీసులున్నారు, తక్కువమంది..ఎక్కువమంది మిగతా సహాయకచర్యల్లొ ఉన్నారు.వీళ్ళు మాత్రం ఏమి చెయ్యగలరు, లాఠి చార్జి చెయ్యలేరు కదా.ఇది జనాలలో ఉండాలి. ఇది ఇలా ఉంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు గుంపులో ఎగబడడానికి అభిమానం అడ్డొస్తుంది. వాళ్ళు ఈ సాయాన్ని తీసుకోరు. వాళ్ళకి కరెంటు, తాగునీరు, పాలు డబ్బులకి దొరికితే చాలు అనుకుంటారు. ఇవి అయినా వెంటనే ఎలావస్తాయి..మొత్తం 3 జిల్లాలు ఊడ్చిపెట్టుకుపోయాయి కరెంటు స్థంభాలు, అన్నింటిని సరిచేసి చెక్ చేసుకోవటనికి చాలా టైం పడుతుంది.పాలు కలెక్షన్ కి వెళ్ళాలంటే పల్లెలకి రోడ్లు, వాహనాలకి డీసిల్ ఉండాలి. రెండు లేవు.మరి పాలు ఎలావస్తాయి.తాగునీటికి జెనరేటర్లు వినియోగిస్తున్నారు. ఒకేసారి సిటీ మొత్తానికి ఇవ్వాలి.కొంచెం సమ్యమనం పాటిస్తూ మనకి వీలయిన ప్రత్యామ్నాయాలు మనం చూసుకోవటం మంచిది.వీలైతే వేరే ఊళ్ళో మీ బంధువుల ఇంతికి వెల్లటం మంచిదేమో.

No comments:

Post a Comment